బద్వేల్ ఉప ఎన్నిక మళ్లీ జరపాలని ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2021-11-03T13:02:48+05:30 IST

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా...

బద్వేల్ ఉప ఎన్నిక మళ్లీ జరపాలని ఆమరణ దీక్ష

కడప/బద్వేలు : బద్వేల్‌లో జరిగిన ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని మళ్లీ ఎన్నికలు జరపాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి బూరగ రత్నం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భారీ స్థాయిలో దొంగ ఓట్లు, అక్రమాలు జరిగాయని ఆర్‌ఓ, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా పట్టించుకోలేదని ఆయన బాలాజి హరివిల్లు వద్ద దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటుకునోటు పంపిణీ చేసి రూ.10కోట్లు అధికార పార్టీ ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసిందని, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తిరిగి ఎన్నిక లు నిర్వహించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు.

Updated Date - 2021-11-03T13:02:48+05:30 IST