బద్వేలు ఉప ఎన్నిక.. పునరాలోచనలో టీడీపీ

ABN , First Publish Date - 2021-10-03T22:00:51+05:30 IST

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే దానిపై టీడీపీ పునరాలోచనలో పడింది. అక్కడ మృతి చెందిన

బద్వేలు ఉప ఎన్నిక.. పునరాలోచనలో టీడీపీ

బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే దానిపై టీడీపీ పునరాలోచనలో పడింది. అక్కడ మృతి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, సతీమణినే వైసీపీ రంగలోకి దింపడంతో పోటీ చేయాలా వద్దా అని టీడీపీ నేతలు సమాలోనలు చేస్తున్నారు. ఇప్పటికే బద్వేలు నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించడంతో బీజేపీ ఇరుకున పడింది. అయితే ఆదివారం కడపలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమవేశంలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. 


కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది. అక్టోబర్ 30న బద్వేలు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ రెండు రోజుల క్రితం నోటిఫికేషన జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదే క్రమంలో ఈనెల 30వ తేదీ జరిగే పోలింగ్‌లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా చైతన్య కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2021-10-03T22:00:51+05:30 IST