బద్వేల్ ఉపఎన్నికలో ఓట్ల కోసం వైసీపీ అడ్డదారి

ABN , First Publish Date - 2021-10-30T14:29:06+05:30 IST

బద్వేల్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తన వ్యూహన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

బద్వేల్ ఉపఎన్నికలో ఓట్ల కోసం వైసీపీ అడ్డదారి

కడప: బద్వేల్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తన వ్యూహన్ని అమలు చేసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. వైసీపీ ప్లాన్‌లో భాగంగా డీఆర్డీఏ‌కి సంబంధించిన ఓ డ్వాక్రా మహిళను దొంగ ఓట్ల కోసం రంగంలోకి దింపినట్లు సమాచారం. అలాగే అట్లూరు మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలతో పాటు ఇతరులతో  మొత్తం కలిపి 600 మందిని వైసీపీ రంగంలోకి దింపినట్లు సమాచారం. వీరందరిని స్థానిక వైసీపీ శ్రేణుల ఇళ్లలో ఉంచి ఈ ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం.

Updated Date - 2021-10-30T14:29:06+05:30 IST