బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్న జనసేన
ABN , First Publish Date - 2021-10-03T04:33:22+05:30 IST
బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్న జనసేన
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక బరి నుంచి జనసేన పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అక్కడ మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అందరూ సహకరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. బద్వేల్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉపఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 8న నామినేషన్లు, 13న నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది.