బహుజన బాంధవుడు నాందేవ్‌ కాంబ్లే

ABN , First Publish Date - 2021-08-04T05:26:59+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతరులతో పాటు దళి తుల సంక్షేమం కోసం పాటుపడిన బహుజన బాంధవుడు దివంగత నే త నాందెవ్‌ కాంబ్లే అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

బహుజన బాంధవుడు నాందేవ్‌ కాంబ్లే
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మావల, ఆగస్టు 3: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతరులతో పాటు దళి తుల సంక్షేమం కోసం పాటుపడిన బహుజన బాంధవుడు దివంగత నే త నాందెవ్‌ కాంబ్లే అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నాందెవ్‌ కాం బ్లె సంతాప సభను జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాందేవ్‌ కాంబ్లె చిత్రపటానికి జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇందులో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, జిల్లా సహకార బ్యాంకు ఇన్‌చార్జి రఘునందన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగయ్య, సహకార బ్యాంక్‌ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బ్యాంక్‌లపై డైరెక్టర్లు ప్రాథమిక సహాకార సంఘాల చైర్మన్‌లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T05:26:59+05:30 IST