శిల్పాచౌదరికి బెయిల్‌

ABN , First Publish Date - 2021-12-16T22:26:43+05:30 IST

శిల్పాచౌదరికి బెయిల్‌ వచ్చింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదయిన మూడు కేసుల్లో ఒక కేసులో ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

శిల్పాచౌదరికి బెయిల్‌

హైదరాబాద్‌: శిల్పాచౌదరికి బెయిల్‌ వచ్చింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదయిన మూడు కేసుల్లో ఒక కేసులో ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన రెండు కేసులపై మరోసారి శిల్ప చౌదరి బెయిల్ పిటిషన్ వేశారు. దివ్యారెడ్డి ఫిర్యాదు చేసిన కేసులో ఆమెకు ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం నార్సింగ్ పోలీసులు శిల్పాచౌదరిని కస్టడిలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. శిల్పాచౌదరి ఆర్థిక మోసం కేసులో పోలీసుల వాదనలు, వారు అందించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే శిల్పాచౌదరి బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. వాదనలు విన్న ఉప్పర్‌పల్లి కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 

Updated Date - 2021-12-16T22:26:43+05:30 IST