‘రెవెన్యూ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందం’

ABN , First Publish Date - 2021-10-16T20:54:00+05:30 IST

రెవెన్యూ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రెవెన్యూ అధికారులు అందరూ ఖచ్చితంగా పనిచేసి..

‘రెవెన్యూ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందం’

ప్రకాశం: రెవెన్యూ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రెవెన్యూ అధికారులు అందరూ ఖచ్చితంగా పనిచేసి.. ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కోల్ సమస్య వలనే విద్యుత్ సమస్య ఏర్పడిందని చెప్పారు. అనీ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందన్నారు. ఎంత ఖర్చు చేసైనా విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా బ్రష్టు పట్టించాడని ఆయన మండిపడ్డారు. సోలార్ పవర్ ను సైతం కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందన్నారు. డిఎల్ వ్యాఖ్యల పై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 

Updated Date - 2021-10-16T20:54:00+05:30 IST