President: ‘బుడా’ నూతన అధ్యక్షుడిగా మారుతి ప్రసాద్‌

ABN , First Publish Date - 2022-09-06T18:23:09+05:30 IST

బళ్లారి నగారాభివృద్ధి ప్రాధికార(బుడా) నూతన అధ్యక్షుడిగా మారుతి ప్రసాద్‌ శర్వశెట్టి(Maruti Prasad Sarvashetty)ని నియమిస్తూ సోమవారం రాష్ట్ర

President: ‘బుడా’ నూతన అధ్యక్షుడిగా మారుతి ప్రసాద్‌

బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 5: బళ్లారి నగారాభివృద్ధి ప్రాధికార(బుడా) నూతన అధ్యక్షుడిగా మారుతి ప్రసాద్‌ శర్వశెట్టి(Maruti Prasad Sarvashetty)ని నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాదికార, నగర యోజన, నగరాభివృద్ధి శాఖ అధీన కార్యదర్శి లతా.కె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మూడు సంవత్సరాల పాటు ‘బుడా’ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆదేశాలు పేర్కొంటూ సదరు ఆదేశాలు ముందు మూడు సంవత్సరాలు, లేదా తరువాత వచ్చే ఆదేశాల వరకు జారీ ఉంటాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. గత నెల 20వ తేదీన పాలన్న అవధి ముగియడంతో ఖాళీ పడిన అధ్యక్ష స్థానానికి మారుతి ప్రసాద్‌ నియమితులు అయ్యారు. సోమవారం రాత్రి 8.30గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించాలని ముహుర్తం నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం నగర ఆరాధ్యదేవత బళ్ళారి దుర్గమ్మను దర్శనం అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకోగా, వర్షం కారణంగా రాత్రి ఆలస్యంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరాములు, సిటీ ఎమ్మెల్యే జి. సోమశేఖర్‌ రెడ్డిలతో పాటు ఆర్యవైశ్య సమాజం ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. 

Updated Date - 2022-09-06T18:23:09+05:30 IST