‘బళ్లారి’లో కరోనాతో ఒక్కరోజే 24 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-08T17:48:06+05:30 IST

జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 24 మంది కరోనా బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 862కి చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బళ్లారి తాలూకాలో

‘బళ్లారి’లో కరోనాతో ఒక్కరోజే 24 మంది మృతి


బళ్లారి రూరల్‌(కర్ణాటక): జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 24 మంది కరోనా బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 862కి చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బళ్లారి తాలూకాలో 480, సండూరులో 246, సిరుగుప్ప 96, కూడ్లిగి 74, హడగళి 77, హోస్పేట 172, హగరి బొమ్మనళ్లి 57, హరప్పనహళ్లి 82 మొత్తం 1284 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకూ మొత్తం 59,334 కరోనా బారిన పడ్డారన్నారు.  

 

రాయచూరులో నలుగురు..

రాయచూరు(కర్ణాటక): జిల్లాలో శుక్రవారం కరోనాతో నలుగురు మరణించారని, దీంతో ఇప్పటివరకూ మొత్తం 184 మంది మరణించినట్లైందని కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. కొత్తగా 762 మంది కరోనా బారిన పడ్డారని, 508 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 762 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. 


Updated Date - 2021-05-08T17:48:06+05:30 IST