కారు ఢీకొని బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-04-22T05:56:14+05:30 IST
వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొ ట్టిన ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు.
పెద్ద దోర్నాల, ఏప్రిల్ 21 : వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొ ట్టిన ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప స్వామి దే వాలయం వద్ద బుధవారం జరిగిన ఈ ప్రమా దంలో దోర్నాలకు చెందిన షేక్ చిన్న మ స్తాన్(13) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం దోర్నాలకు చెందిన చిన్న మస్తాన్ త్రిపురాంతకం మండలం గణపవరం గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కరోనా నేప థ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వచ్చాడు. ఉద యాన్నే బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రో డ్డు పక్కన మార్జినులో నడుస్తుండగా శ్రీశైలం వైపు వెళ్తున్న కారు అ దుపు తప్పి చిన్న ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలైన మస్తాన్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు హుస్సేన్బీ, సైదావలి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.