కుమారుడి కోసం సాంప్రదాయాలు మార్చకండి.. వైవీకి బండారు సూచన

ABN , First Publish Date - 2020-09-20T04:36:02+05:30 IST

తిరుమల తిరుపతి సంస్కృతిని, వై వి సుబ్బారెడ్డి కలుషితం చేయడం సరైంది కాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. టీటీడీ బై ..

కుమారుడి కోసం సాంప్రదాయాలు మార్చకండి.. వైవీకి బండారు సూచన

విశాఖ: తిరుమల తిరుపతి సంస్కృతిని, వై వి సుబ్బారెడ్డి కలుషితం చేయడం సరైంది కాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. టీటీడీ బై లానే తమరు మార్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. హిందూ సాంప్రదాయం కాపాడాలని సూచించారు. ఏడుకొండల స్వామి పవిత్రతను కాపాడాలన్నారు. గతంలో ఇందిరాగాంధీ, అబ్దుల్ కలాం కూడా సంతకం పెట్టే తిరుమలకు వెళ్లారని గుర్తు చేశారు. తమ కుమారుడి కోసం సాంప్రదాయాలను మార్చకండన్నారు. ఏడుకొండలస్వామి కన్నెర్ర చేస్తే ఏమౌతుందో అందరికీ తెలుసని బంగారు సత్యనారాయణ అన్నారు. 

Updated Date - 2020-09-20T04:36:02+05:30 IST