అచ్చెన్నాయుడిని చూసి జగన్ భయపడుతున్నారు: బండారు సత్యనారాయణ
ABN , First Publish Date - 2020-02-23T00:36:31+05:30 IST
బీసీలంటే ప్రభుత్వానికి చిన్నచూపని టీడీపీ నేత బండారు సత్యనారాయణ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఎద్దేవాచేశారు.
విశాఖ: బీసీలంటే ప్రభుత్వానికి చిన్నచూపని టీడీపీ నేత బండారు సత్యనారాయణ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. అందుకే ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక వర్గానికే కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని, ఉత్తరాంధ్రలో బీసీలు ఎదగకూడదా అని ప్రశ్నించారు. దమ్ముంటే విజిలెన్స్ రిపోర్ట్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు వేసిన సిట్లో మంత్రులే ఉన్నారని విమర్శించారు. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, జగన్ బాగోతం బయటపడుతుందో అని... భయంతో మోదీ కాళ్లు పట్టుకున్నారని బండారు సత్యనారాయణ ధ్వజమెత్తారు.