సీఎం కేసీఆర్ విమర్శలపై బండి సంజయ్ కౌంటర్.. మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు..
ABN , First Publish Date - 2021-11-30T21:28:35+05:30 IST
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలన్నారు. తాము కూడా అలాగే మాట్లాడితే తట్టుకోలేరని అన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్కు పిచ్చి పట్టిందన్నారు. మెడపై కత్తి పెడితే ఫాం హౌస్ రాసిస్తారా?... ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రా రైస్ పక్కాగా కొంటామని కిషన్రెడ్డి చెప్పారన్నారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎలా బంద్ చేస్తారో చూస్తామన్నారు. వానాకాలం పంటను ఎలా కొంటున్నారో..అలానే యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ అంటే కేసీఆర్కు ఎందుకంత ప్రేమ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పాలనతో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు. వరి వద్దన్నారు.. మరి ఏ పంట వేయాలో చెప్పాలి కదా అని బండి సంజయ్ అన్నారు.