పోతిరెడ్డిపాడు అంశంపై పవన్తో చర్చించా: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-05-26T02:30:42+05:30 IST
పోతిరెడ్డిపాడు అంశంపై పవన్తో చర్చించామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పవన్ కల్యాణ్తో ...
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశంపై పవన్తో చర్చించామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పవన్ కల్యాణ్తో సమావేశమైన ఆయన తెలుగురాష్ట్రాల సీఎంలు ప్రజలు మధ్య విద్వేషాలు రగిలించాలని చూస్తున్నారన్నారు. తెలంగాణని ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కాపాడుకుంటామని బండి సంజయ్ తెలిపారు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్కు ఉందా? అని ప్రశ్నించారు. హిందువులు గర్జిస్తే కేసీఆర్, జగన్ పారిపోతారన్నారు. తిరుమలను కాపాడుకోవటానికి హిందువులు ముందుకురావాలని బండి సంజయ్ సూచించారు.