కాళేశ్వరం వెళ్లింది అందుకే.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-01-20T19:52:46+05:30 IST

కాళేశ్వరం ప్రాజక్టుపై ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడ్తున్నారని, మూడో టీఎంసీతో సాధించిందేంటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.

కాళేశ్వరం వెళ్లింది అందుకే.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారన్నారు. పూజా సామాగ్రిని త్రివేణి సంగంమంలో కలపటానికే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్ళారన్నారు. కాళేశ్వరంలో సీఎం దంపతులు ఏం కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుపై ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడ్తున్నారని, మూడో టీఎంసీతో సాధించిందేంటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. 


రానున్న మూడేళ్ళల్లో లక్షల కోట్లు వెనుకేసుకోవటానికి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని.. పగ్రతి భవన్‌లో చాలా టీవీలు పగులుతున్నాయట అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీవీలు పగులుతున్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారన్నారు. ఉద్యమ ద్రోహులు‌‌ మాత్రమే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారని, టీఆర్ఎస్‌లో ఉన్న నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం కావటం ఇష్టం లేదన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతీసారీ ఈటలను ముందుపెట్టి కేసీఆర్ బయటపడ్తున్నారని విమర్శించారు. తమకు ప్రజల మద్దతుందన్నారు. కేటీఆర్ సీఎం అయితే తమకొచ్చే లాభమేమీ లేదని, ఒకవేళ ముందుకొస్తే.. బీజేపీ సిద్ధాంతం, అవినీతి మరకలు లేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రమే బీజేపీలో చేర్చుకుంటాంమన్నారు. కేసీఆర్ తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, 125అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఎంత వరకు వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ చేసే పూజలు ఆయన కుటుంబ బాగు కోసమేనని, తాము చేసే పూజలు సమాజహితం‌ కోసం అన్నారు.  

Updated Date - 2021-01-20T19:52:46+05:30 IST