తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-08-01T19:28:17+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలని, ధర్మం గెలవాలని అమ్మవారిని మొక్కుకున్నానని...

తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగాలి: బండి సంజయ్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలని, ధర్మం గెలవాలని అమ్మవారిని మొక్కుకున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆ పాలన వచ్చిన తర్వాత మళ్లీ అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. అమ్మవారు చాలా శక్తివంతమైనదని విజయశాంతి చెప్పారని, ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని ఆమె మొక్కుకున్నట్లు చెప్పారన్నారు. ఇవాళ ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తోందని, ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

హైదరాబాద్ నవాబులది కాదని బండి సంజయ్ అన్నారు. 1880లో ప్లేగు వ్యాధి వచ్చిందని అప్పుడు సైనికుల కోసం మొక్కుకున్నారన్నారు. సనాతన ధర్మం నవాబులది కాదని, హిందువులదని అన్నారు. హిందూ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే బోనాల జాతరని..అమ్మవారు విశ్వాసం, నమ్మకం అందరిపైన ఉంటుందని, నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం కాపాడం కోసం మనమంతా కలిసి పోరాడాలన్నారు. కరోనా మహమ్మరి నుంచి దేశ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బండి సంజయ్ చెప్పారు.

Updated Date - 2021-08-01T19:28:17+05:30 IST