సీఎం కేసీఆర్‌‌కు బండి సంజ‌య్ లేఖ

ABN , First Publish Date - 2021-08-18T00:24:13+05:30 IST

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ మంగళవారం లేఖ రాశారు.

సీఎం కేసీఆర్‌‌కు బండి సంజ‌య్ లేఖ

హైదరాబాద్: ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ మంగళవారం లేఖ రాశారు. కేఆర్ఎంబీ ఇటీవ‌ల అక్రమంగా నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును సంద‌ర్శించిందన్నారు. మెజార్టీ ప‌నులు పూర్తి చేసిన‌ట్టు కేంద్రానికి రిపోర్టు స‌మ‌ర్పించిందని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకోనందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప‌నులు కొన‌సాగాయన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని బీజేపీ ప‌దిహేను నెల‌ల ముందే హెచ్చ‌రించిందన్నారు. అపెక్స్ స‌మావేశానికి హాజ‌రు కాకుండా ఆ త‌ర్వాత మొస‌లి క‌న్నీరు కారిస్తే తెలంగాణకు ఏం లాభమని బండి సంజ‌య్ ప్రశ్నించారు. 


‘‘వైఎస్ జ‌గ‌న్‌తో క‌లిసి మీరు రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో వికృత క్రీడ ఆడుతున్నారు. కాంట్రాక్ట‌ర్‌కు ల‌బ్ధి చేకూర్చేందుకే ఇరు రాష్ట్రాల సీఎంలు ప‌నిచేస్తున్నారు. మీ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఏపీ ఈ ప్రాజెక్టును 90శాతం పూర్తిచేసింది. మీ స్వార్థ పూరిత వైఖ‌రితో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. ఈ విషయంపై మీరు వెంట‌నే స‌మాధానం చెప్పాలి’’ అని లేఖలో బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-18T00:24:13+05:30 IST