కేసీఆర్ ఆ ఒక్కటి చేస్తే పల్లకి మోస్తా : బండి సంజయ్

ABN , First Publish Date - 2021-01-17T17:29:39+05:30 IST

ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన..

కేసీఆర్ ఆ ఒక్కటి చేస్తే పల్లకి మోస్తా : బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తే.. ఆయన పల్లకి మోస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మూడు లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని విమర్శలు గుప్పించారు. ధనిక‌ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.


కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది!

కరోనా మహమ్మారిని ముఖ్యమంత్రి కేసీఆర్ చులకనగా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం చర్యల వలనే కరోనాను అడ్డుకోగలిగాం. ఆయుష్మాన్ భారత్‌ను సరైన సమయంలో అమలు చేయకపోవటం వలన పేదలు ప్రాణాలు కోల్పోయారు. కబ్జాదారులను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతోంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోంది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రామమందిర నిర్మాణంపై వారి అభిప్రాయం చెప్పాలి. కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయ్. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూస్ పథకాన్ని అమలు చేయాలిఅని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాగా ఈ కార్యక్రమంలో తరుణ్‌చుగ్‌, కిషన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T17:29:39+05:30 IST