నల్లగొండ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-11-15T00:29:24+05:30 IST

ధాన్యం విక్రయానికి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

నల్లగొండ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన

నల్లగొండ: ధాన్యం విక్రయానికి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి కనీస మద్దతు ధర కోసం రైతులు పడుతున్న కష్టాలను వారినే అడిగి తెలుసుకోనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఈ నెల 16న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో పర్యటించి ఆ తర్వాత జనగామ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 

Updated Date - 2021-11-15T00:29:24+05:30 IST