‘ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదు’
ABN , First Publish Date - 2021-12-07T01:07:15+05:30 IST
ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతిలో సీఎం వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు తప్ప తమంకు ఎటువంటి సమాచారం లేదన్నారు.
విజయనగరం: ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతిలో సీఎం వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పారు తప్ప తమంకు ఎటువంటి సమాచారం లేదన్నారు. జీతాలు గురించి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమకు రావాల్సిన ఏడూ డీ ఏ లు ఇవ్వలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలయాపన జరుగుతుంది అని రోడ్డున పడ్డామన్నారు. సీఎం తమ బాధలు అర్ధం చేసుకుని న్యాయపర డిమాండ్లు తీర్చాలన్నారు. అవసరం అయితే రెండో దశ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.