డ్రగ్స్ కేసు: రెండు రోజుల్లో ఎమ్మెల్యేలకు నోటీసులు

ABN , First Publish Date - 2021-04-05T21:56:44+05:30 IST

కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది.

డ్రగ్స్ కేసు: రెండు రోజుల్లో ఎమ్మెల్యేలకు నోటీసులు

హైదరాబాద్: కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు  శాండిల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ అరెస్ట్ తరువాత వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత గోవింద పుర పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు నిర్మాత శంకర్ గౌడ్ మత్తు మందు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. రెండు రోజుల్లో ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో అప్రూవర్‌గా మారిన కీలక సూత్రదారి మస్తాన్ చంద్ర విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీకి విదేశీ యువతులను, ఇరానీ యువతులను రప్పించినట్లు పోలీసులకు తెలిపాడు.

Updated Date - 2021-04-05T21:56:44+05:30 IST