వేల మంది యువతులను వ్యభిచార కూపంలోకి లాగిన భార్యాభర్తలు.. అనుకోకుండా పట్టుబడిన నేరస్తులు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-03T13:14:41+05:30 IST

అతడు బంగ్లాదేశ్‌కి చెందిన ఒక దళారీ. రెండు దశాబ్దాల క్రితమే భారతదేశం వచ్చి పేరు మార్చుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. బంగ్లేదేశ్ నుంచి వేల మంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవాడు. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు యువతులు సరఫరా చేసేవాడు. అనుకోకుండా ఒక నేరంలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా అతడి వ్యవహారమంతా బయటపడింది...

వేల మంది యువతులను వ్యభిచార కూపంలోకి లాగిన భార్యాభర్తలు.. అనుకోకుండా పట్టుబడిన నేరస్తులు.. అసలేం జరిగిందంటే..

అతడు బంగ్లాదేశ్‌కి చెందిన ఒక దళారీ. రెండు దశాబ్దాల క్రితమే భారతదేశం వచ్చి పేరు మార్చుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. బంగ్లేదేశ్ నుంచి వేల మంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవాడు. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు యువతులు సరఫరా చేసేవాడు. అనుకోకుండా ఒక నేరంలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా అతడి వ్యవహారమంతా బయటపడింది. అసలేం జరిగిదంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ నగరంలో ఒక వ్యభిచార ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా నాయకుడితో సహా 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఒక హవాలా(మనీ లాండరింగ్) కేసులో పోలీసులు విచారణ చేస్తుండగా.. ఈ ముఠా గురించి పోలీసులకు తెలిసింది. నేరస్తులను గురించి పోలీసులు మరింత విచారణ చేయగా.. ఆ ముఠా నాయకుడు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.


పోలీసుల కథనం ప్రకారం.. మామున్ హుసేన్(41) బంగ్లాదేశ్ నుంచి 25 సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చాడు. మామున్ హుసేన్ తన పేరు విజయ్ దత్‌గా మార్చుకుని ముంబైలో స్థిరపడ్డాడు. అతనికి ఇంతకు ముందే బంగ్లాదేశ్‌లో వివాహమైనా.. భారత్‌లో కూడా మరో వివాహం చేసుకున్నాడు. ఇక్కడే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు అన్నీ చేయించుకున్నాడు. బంగ్లాదేశ్ నుంచి గత 20 సంవత్సరాలుగా యువతులను తీసుకువచ్చి పడుపు వృత్తిలోకి వారిని లాగాడు. ఈ వ్యవహారంలో అతడి మొదటి భార్య బంగ్లాదేశ్ నుంచి కార్యకలాపాలు నిర్వహించేది. బంగ్లాదేశ్ ఆమె తను ఒక ప్రభుత్వ అనుబంధ సేవా సంస్థ నడుపుతున్నానని చెప్పి పేద, ఒంటరిగా ఉన్న యువతుల వద్దకు వెళ్లేది. వారికి భారత్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేది.


అలా మామున్ హుసేన్, అతడి భార్య భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలలో తమ ఏజెంట్లను నియమించుకొని.. బంగ్లాదేశ్ నుంచి యువతులను ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవారు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బులతోపాటు.. బడా బాబుల వద్ద నుంచి నల్లధనం తీసుకొని హవాలా వ్యాపారం చేసేవారు. అనుకోకుండా ఇందోర్ నగరంలో ఈ హవాలా కార్యకలాపాలు వెలుగు చూడడంతో పోలీసులు మామున్ హుసున్‌తో పాటు ఏడుగురు నేరస్తులను అరెస్టు చేశారు. అతడి గురించి విచారణ చేయగా.. ఈ వ్యభిచార వ్యాపారం గురించి తెలిసింది. గత దశాబ్దకాలంలో వేల మంది యువతులను బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-03T13:14:41+05:30 IST