బంజారాహిల్స్ సీఐ కళింగరావు, మరో ఎస్సైకి కరోనా
ABN , First Publish Date - 2021-04-05T22:36:56+05:30 IST
బంజారాహిల్స్ పోలీసులను కరోనా వెంటాడుతోంది. సెకెండ్ వేవ్లో 11 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసులను కరోనా వెంటాడుతోంది. సెకెండ్ వేవ్లో 11 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ సీఐ కళింగరావు, మరో ఎస్సై కరోనా బారిన పడ్డారు. రోజురోజుకు పోలీస్స్టేషన్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పోలీసు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో బంజారాహిల్స్ పీఎస్లో 50 మంది పోలీసులకు కరోనా సోకింది.
మరోవైపు ఎల్బీనగర్లోని చిత్ర లే అవుట్లో ఉంటున్న అనాథ విద్యార్థి గృహంలో 45మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్లో మొత్తం 100 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో మిగిలిన వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటీవ్ వచ్చిన వారిని గ్రౌండ్ ప్లోర్లో ఉన్న ఐసోలేషన్ రూమ్లో ఉంచనున్నారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను ఫస్ట్ ప్లోర్కు తరలించనున్నారు.