ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ
ABN , First Publish Date - 2020-04-09T22:25:12+05:30 IST
లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ...
హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. నగరంలో గురువారం జరిగిన భోజన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు సుమారు 3000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుఖ్దేవ్ నగర్ కాలనీ, దేవరకొండ బస్తీ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌటికే విఠల్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.