మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. యువకులపై కేసు

ABN , First Publish Date - 2021-04-05T14:37:39+05:30 IST

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేసిన యువకులపై

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. యువకులపై కేసు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేసిన యువకులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హకీంపేటకు చెందిన ఓ మహిళ పిల్లలతో కలిసి పది సంవత్సరాలుగా నివాసముంటుంది. ఆమె ఇంటి పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై అజర్‌, తాహెరా, షరీఫ్‌, సలీం కన్నేశారు.  మహిళ అడ్డుగా ఉండటంతో ఆమెను దుర్భాషలాడటం మొదలు పెట్టారు. ఈ నెల 1న కూడా హకీంపేటకు వచ్చిన నలుగురు  ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భషలాడటంతో పాటు దాడి చేశారు. తమ కార్యకలాపాలకు అడ్డుగా వస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-05T14:37:39+05:30 IST