మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. యువకులపై కేసు
ABN , First Publish Date - 2021-04-05T14:37:39+05:30 IST
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేసిన యువకులపై
హైదరాబాద్/బంజారాహిల్స్ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేసిన యువకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హకీంపేటకు చెందిన ఓ మహిళ పిల్లలతో కలిసి పది సంవత్సరాలుగా నివాసముంటుంది. ఆమె ఇంటి పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై అజర్, తాహెరా, షరీఫ్, సలీం కన్నేశారు. మహిళ అడ్డుగా ఉండటంతో ఆమెను దుర్భాషలాడటం మొదలు పెట్టారు. ఈ నెల 1న కూడా హకీంపేటకు వచ్చిన నలుగురు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భషలాడటంతో పాటు దాడి చేశారు. తమ కార్యకలాపాలకు అడ్డుగా వస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.