గుండెపోటుతో బ్యాంకు మేనేజరు మృతి?
ABN , First Publish Date - 2021-04-16T05:36:01+05:30 IST
నెల్లూరులో ఓ బ్యాంకు మేనేజరు గుండెపోటుతో మృతి చెందారు.
నెల్లూరు(క్రైం), ఏప్రిల్ 15: నెల్లూరులో ఓ బ్యాంకు మేనేజరు గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా కొండేపి మండలానికి చెందిన బద్దెపూడి అనిల్కుమార్(37) నెల్లూరు రేబాలవారి వీధిలోని ఎస్బీఐలో బ్రాంచి మేనేజరుగా పనిచేస్తున్నారు. అవివాహితుడు కావడంతో హరనాథపురం రెండో వీధిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి బ్యాంకు నుంచి ఇంటికి వచ్చి బెడ్రూమ్లో నిద్రపోయాడు. గురువారం ఉదయం బ్యాంకు సిబ్బంది అనిల్కుమార్కు ఎన్నిసార్లు ఫోన్చేసినా తీయకపోవడంతో డయల్ 100కు సమాచారమిచ్చారు. దీంతో బాలాజీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి పరిశీలించగా అనిల్కుమార్ కిందపడి మృతి చెంది ఉన్నాడు. రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంచం మీద నుంచి లేచి గుండెనోప్పితో బాధపడుతూ అడుగులు వేసే క్రమంలో కిందపడి ముఖానికి రక్తగాయాలైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనిల్ బావ వేమూరి కృష్ణకిషోర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.