వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

ABN , First Publish Date - 2021-03-09T16:18:51+05:30 IST

బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వతేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి....

వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

న్యూఢిల్లీ : బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వతేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో మార్చి 13 నుంచి వరుసగా 4రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13వతేదీన రెండవ శనివారం కాగా, మార్చి 14వతేదీ ఆదివారం సెలవు. మార్చి 15,16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూసివేయనున్నారు.మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల బ్రాంచీలు పనిచేయవు.


పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకు శాఖలు పనిచేయవు.స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి. మార్చి 11వతేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22వతేదీన బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వరుస సెలవులతో బ్యాంకులను మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించాయి.


Updated Date - 2021-03-09T16:18:51+05:30 IST