లంక మాజీ క్రికెటర్పై ఎనిమిదేళ్ల నిషేధం
ABN , First Publish Date - 2021-04-20T10:53:47+05:30 IST
లంక మాజీ క్రికెటర్పై ఎనిమిదేళ్ల నిషేధం
దుబాయ్: అవినీతి ఆరోపణలతో శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హార లోకుహెట్టిగే (40)పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. యూఏఈలో జరిగిన 10 ఓవర్ల లీగ్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని రెండేళ్ల క్రితమే తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆ ఆరోపణలు రుజువు కావడంతో ఇప్పుడు నిషేధం విధించారు.