రఘురామకృష్ణంరాజుపై స్పీకర్కు వైసీపీ ఎంపీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-25T04:10:34+05:30 IST
రఘురామ కృష్ణరాజుపై స్పీకర్ ఓం బిర్లాకు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ టికెట్పై..
న్యూఢిల్లీ: రఘురామ కృష్ణరాజుపై స్పీకర్ ఓం బిర్లాకు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ టికెట్పై గెలిచి రఘురామరాజు పార్టీగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామరాజును ఎంపీ పదవి నుంచి తొలగించాలని స్పీకర్ను నందిగాం సురేష్ కోరారు.
ఈ సందర్భంగా నందిగం సురేష్ మాట్లాడుతూ ‘‘రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. రఘురామరాజు సంస్కారం లేని వ్యక్తి. దళితులను కించపరిచే విధంగా మాట్లాడారు. రాజా భాయ్ ఎవరో తెలపాలి. ఏపీలో గెలిచిన రఘురామ కృష్ణరాజు ఢిల్లీకే పరిమితం అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రఘురామ కృష్ణరాజు కామెంట్ చేయడం చాలా దారుణం. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు.’’ అని అన్నారు.