యూపీలో బీజేపీ నేత హత్య... ఇంటికి 20 మీటర్ల దూరంలో మృతదేహం!

ABN , First Publish Date - 2021-08-09T15:07:32+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో...

యూపీలో బీజేపీ నేత హత్య... ఇంటికి 20 మీటర్ల దూరంలో మృతదేహం!

బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సుబేహా పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిత్ పుర్వా గ్రామంలో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత హరిహర్ సింగ్‌(65)ను హత్య చేశారు. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. 


హరిహర్ సింగ్ మృతదేహం అతని ఇంటి వెనుక కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బీజేపీ బూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్న హరిహర్ సింగ్‌కు సంతానం లేదు. భార్య కూడా ఇటీవలే కన్నుమూసింది. దీంతో అతను ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాడు. మృతుని మెడపై గాట్లను పోలీసులు గుర్తించారు. మృతుని ఇంటికి 20 మీటర్ల దూరంలోనే అతని మృతదేహం లభ్యమయ్యింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-09T15:07:32+05:30 IST