రాజధాని దళితులకు అండగా త్వరలో భరోసా యాత్ర
ABN , First Publish Date - 2020-10-25T12:21:09+05:30 IST
రాష్ట్రరాజధానికి 32 శాతం భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటామని జైభీమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపకుడు..
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రరాజధానికి 32 శాతం భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటామని జైభీమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపకుడు, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్కుమార్ తెలిపారు. అతిత్వరలోనే భూములిచ్చిన రైతులను కలసి వారిలో ధైర్యం నింపడానికి భరోసాయాత్ర చేపడతున్నట్టు పేర్కొన్నారు. అమరావతి అన్ని సామాజిక వర్గాలకు చెందిందనే వాస్తవం రాష్ట్ర ప్రజలకు తెలపడానికే ఈ యాత్ర చేపడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.