18, 19 తేదీల్లో బీసీ కమిషన్ జిల్లా పర్యటన
ABN , First Publish Date - 2021-10-17T05:12:56+05:30 IST
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు, అక్టోబరు 16: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు 18న ఉదయం 9నుంచి 10 గంటల వరకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో బీసీ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 10నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పద్మావతి యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బీల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజా సమస్యలపై బహిరంగ విచారణ, అర్జీల స్వీకరణ ఉంటుంది. 4నుంచి 5 గంటల వరకు టీటీడీ ఉద్యోగుల నుంచి వినతులు తీసుకుంటారు. 6 నుంచి 7 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సమీక్ష, రాత్రి 7నుంచి 7.30 గంటల వరకు బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమశాఖల అఽధికారులతో సమావేశం జరుగుతుంది. 19న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.