బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2021-07-30T06:29:17+05:30 IST
ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల శ్రీనివాసరావు నియమితులయ్యారు.
గుంటూరు, జూలై 29: ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం చుట్టుగుంట సెంటర్లోని సంఘ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ల నుంచి శ్రీనివాసరావు నియామకపు పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అట్రాసిటీ చట్టంతో బీసీలే అత్యధికంగా నష్టపోతున్నారని, అటువంటి చట్టమే బీసీలకు తీసుకురావాలని లేని పక్షంలో అట్రాసిటీ చట్టం నుంచి బీసీలకు మినహాయింపు కల్పించాలని కోరారు. సమావేశంలో గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ, బండారు సోమరాజు, కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.