ఐపీఎల్లో వివో ఉంటుంది: బీసీసీఐ
ABN , First Publish Date - 2020-08-03T21:27:54+05:30 IST
ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ స్పాన్సర్ల జాబితా నుంచి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివోను..
న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ స్పాన్సర్ల జాబితా నుంచి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివోను తొలగించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే మరో రెండేళ్లపాటు ఒప్పందం ఉన్న నేపథ్యంలో వివోను ఐపీఎల్ నుంచి తొలగించలేమని బీసీసీఐ గవర్నింగ్ కౌన్సెల్ తెలిపింది. అంతేకాకుండా స్పాన్సర్లకు సంబంధించి తుది నిర్ణయాన్ని వెల్లడించింది. గత ఏడాది ఉన్న స్పాన్సర్లందరూ ఈ ఏడాది కూడా కొనసాగుతారని. అందులో చైనా కంపెనీ వివో కూడా ఉంటుందని ప్రకటించింది. ‘ఐపీఎల్కు సంబంధించి వివో బ్రాండ్ బీసీసీఐతో 5 సంవత్సరాల ఒప్పందం చేసకుంది. ప్రతి ఏడాది ఐపీఎల్ స్పాన్సర్గా రూ.440 కోట్లను అందిస్తోంది. అయితే వివో ఒప్పందం 2022తో పూర్తికానుంది. అంతేకాకుండా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే వివోను స్పాన్సర్గా కొనసాగించనున్నట్లు బీసీసీఐ నిర్ణయించింద’ని కొందరు అధికారులు చెప్పారు.