జూలైలో శ్రీలంక టూర్కు టీమిండియా: గంగూలీ
ABN , First Publish Date - 2021-05-10T09:26:19+05:30 IST
భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండే అవకాశం లేదు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండే అవకాశం లేదు. ఆ సమయానికి వీరిద్దరు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్లో ఉంటారు. ఈ స్టార్ ఆటగాళ్లు లేకుండానే లంక టూర్లో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్ ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.
‘ఈ జట్టు పరిమిత ఓవర్ల స్టార్లతో ఉంటుంది. ఇది పూర్తిగా భిన్నమైన జట్టు’ అని దాదా చెప్పాడు. ఇక వాస్తవానికి జూలైలో కోహ్లీ, రోహిత్ ఖాళీగానే ఉన్నా ఇక్కడికి వస్తే క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఇక ధవన్, హార్దిక్, భువనేశ్వర్, దీపక్ చాహర్, చాహల్ వంటి వారు మ్యాచ్ ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనతోనే లంకతో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడించే అవకాశం ఉన్నట్టు బోర్డు అధికారి తెలిపాడు.