బీసీఎన్లో ఐపీటీవీ డివైజ్ : రుద్రరాజు
ABN , First Publish Date - 2021-10-17T05:11:01+05:30 IST
దేశంలోనే తొలిసారిగా బీసీఎన్ డిజిటల్ ఛానల్ ద్వారా ఐపీటీవీ డివైజ్ను వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని బీసీఎన్ డిజిటల్ ఎండీ రుద్రరాజు శ్రీనివాసరాజు అన్నారు.
భీమవరం, అక్టోబరు 16 : దేశంలోనే తొలిసారిగా బీసీఎన్ డిజిటల్ ఛానల్ ద్వారా ఐపీటీవీ డివైజ్ను వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని బీసీఎన్ డిజిటల్ ఎండీ రుద్రరాజు శ్రీనివాసరాజు అన్నారు. బీసీఎం కార్యాల యంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇటువంటి టెక్నాలజీ దేశంలో రాబోయే ఐదేళ్ల తరువాత మాత్రమే అందుబాటులోకి వస్తుందన్నారు. బీసీఎం కేబుల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. సుమారు 10 లక్షల కనెక్షన్లకు చేరామన్నారు. ఇప్పటి వరుకు పది శాతం వినోదం అందుబాటులో ఉందని ఐపీ టీవీ వల్ల 90 శాతం అందుబాటులోకి వస్తుందన్నారు.