Be alert : బెంగాల్ అధికారులకు సర్కారు ఆదేశం

ABN , First Publish Date - 2021-10-19T17:05:18+05:30 IST

అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించండి అంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది...

Be alert : బెంగాల్ అధికారులకు సర్కారు ఆదేశం

బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించండి అంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ దాడుల తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిఘాను ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను సూచించింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు,దుర్గా పూజ పండళ్లపై ఆకతాయిలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సర్కారు ఈ హెచ్చరిక జారీ చేసింది.బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అధికారులను సర్కారు అప్రమత్తం చేసేంది.సున్నితమైన సరిహద్దు జిల్లాల్లో పండుగ సీజన్‌లో శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా యంత్రాంగాన్ని మమతా సర్కారు ఆదేశించింది.బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో  సోషల్ మీడియా పోస్ట్‌పై 66 ఇళ్లను ధ్వంసం చేసి, కనీసం 20 మంది హిందువుల ఇళ్లను తగలబెట్టారు.ఈ హింసాకాండలో 52 మంది అనుమానితులను అరెస్టు చేశారు. 


Updated Date - 2021-10-19T17:05:18+05:30 IST