ధైర్యంగా ఉండండి.. మేమున్నాం

ABN , First Publish Date - 2021-06-23T06:36:26+05:30 IST

క్షతగాత్రులకు పరిటాల శ్రీరామ్‌ పరామర్శ

ధైర్యంగా ఉండండి.. మేమున్నాం
సవేరా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న పరిటాల శ్రీరామ్‌


అనంతపురం వైద్యం, జూన22: ‘వైసీపీ దౌర్జ న్యా లు పెరిగి పో యాయి. అంద రూ కలిసికట్టు గా ఎదుర్కొం దాం. మేము న్నాం... ధై ర్యం గా ఉండం డి.’ అని క్షతగాత్రు లకు పరిటాల శ్రీరామ్‌ అభయం ఇచ్చారు. సీకేపల్లి మండలం ము ష్టికోవెలలో వైసీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆ యన మంగళవా రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆం జనేయులు, నరసింహు లు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో శ్రీరామ్‌ అరగంట పాటు గడిపారు. ఘటనపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల అరాచకాలు గురించి వివరిస్తూ శ్రీరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైందని, మనందరం ధైర్యంగా వారి ఆగడాలను ఎదుర్కొందామన్నారు.

ముష్టికోవెల ఘటనలో 10 మంది వైసీపీ వర్గీయుల అరెస్టు

- హత్యాయత్నం కేసు నమోదు - రిమాండ్‌కు తరలింపు

చెన్నేకొత్తపల్లి, జూన22:మండలంలోని ముష్టికోవెల గ్రామంలో టీడీపీ వర్గీయులపై దాడి ఘటనలో పది మంది వైసీపీ వర్గీయుల ను మంగళవారం అరెస్టు చేసినట్టు రామగిరి సీఐ చిన్నగౌస్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. టీడీపీకి చెందిన తండ్రీకొడుకులు పందిపర్తి ఆం జనేయులు, నరసింహులు సోమవారం రాత్రి వైసీపీకి చెందిన చం ద్రశేఖర్‌ వర్గీయులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన పిర్యాదుమేరకు పదిమందిపై హత్యా యత్నం కేసు నమోదు చేశామన్నారు. ఈ సంఘటనను సీరియస్‌ గా తీసుకుని కొన్నిగంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి 15 రోజులు రిమాండ్‌ విధించా రన్నారు. కాగా గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు పోలీసు బందోబస్తు కొనసాగిస్తామని సీఐ,ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-06-23T06:36:26+05:30 IST