జాగ్రత్తలు పాటించండి
ABN , First Publish Date - 2020-03-27T11:33:24+05:30 IST
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మునిసి పల్
పార్వతీపురం టౌన్, మార్చి 26 : కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మునిసి పల్ కమిషనర్ కనక మహాలక్ష్మి కోరారు. గురువారం పట్టణ ప్రధాన కాయగూరల మార్కెట్లో ప్రజలకు అవగాహన కల్పించారు. గుంపులుగా ఉండరాదని, మార్కెట్కు కుటుం బంలో ఒక్కరే రావాలని, వ్యక్తిగత , పట్టణ పరిశుభ్రత పాటించాలని సూచిం చారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయకుండా, పారిశుధ్య కార్మికు లకు అందజేయాలని కోరారు. పట్టణంలో 144 సెక్షన్ విధించామని, ఏవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ దాశరథి తెలిపారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
పట్టణంలోని 30వ వార్డులో 350 కుటుంబాలకు 5కేజిల బియ్యంతోపాటు నిత్యావసర సరులకు గురువారం పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త, జగన్నా థపురం వైసీపీ నేత ఆర్.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో వాటిని అందించారు.