కరోనాతో జాగ్రత్త
ABN , First Publish Date - 2022-01-20T04:45:10+05:30 IST
కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున వ్యాపారులు జాగ్రత్తలతో ఉండాలని సీఐ సుధాకర్ తెలిపారు.
వ్యాపారులకు సీఐ సుధాకర్ అవగాహన
పొదిలి (రూరల్) జనవరి 19 : కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున వ్యాపారులు జాగ్రత్తలతో ఉండాలని సీఐ సుధాకర్ తెలిపారు. ముం దు గా వ్యాపారులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్, భౌతికదూరం పా టిస్తూ అమ్మకాలు జరపాలని సూచించారు. మాస్క్, శానిటైజర్ అం దు బాటులో ఉంచాలన్నారు. నోమాస్క్, నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేసు కోవాలన్నారు. మాస్కు లేకుండా వచ్చిన కొనుగోలుదారులను తిప్పి పం పాలని, మాస్కు ఉన్నవారికి మాత్రమే అనుమతిచ్చి వ్యాపారం కొన సా గించాలన్నారు. మాస్క్ లేకుండా కన్పిస్తే జరిమానా తప్పదని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీహరి వ్యాపారులు పాల్గొన్నారు.