ఆస్తి పన్ను వసూలుకు సన్నద్ధం కండి!

ABN , First Publish Date - 2021-09-19T04:13:36+05:30 IST

రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా ఆస్తి పన్నుల వసూలుకుసిద్ధంగా ఉండాలని గుంటూరు రీజియన్‌లోని మున్సిపాలిటీల డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశించారు.

ఆస్తి పన్ను వసూలుకు సన్నద్ధం కండి!
సమీక్ష నిర్వహిస్తున్న మున్సిపల్‌ ఆర్‌జేడీ శ్రీనివాసరావు

ఆర్‌డీఎం శ్రీనివాసరావు

గూడూరు, సెప్టెంబరు 18: రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా ఆస్తి పన్నుల వసూలుకుసిద్ధంగా ఉండాలని గుంటూరు రీజియన్‌లోని మున్సిపాలిటీల డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్‌లతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  యూజర్‌ చార్జీలను, పన్ను బకాయిలను సకాలంలో వసూలు చేయాలన్నారు. అనంతరం పలు సచివాలయాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నరేంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-09-19T04:13:36+05:30 IST