అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-10-22T07:10:51+05:30 IST

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అధికార

అప్రమత్తంగా ఉండండి

కట్టలు తెగే అవకాశం ఉన్న 

చోట ప్రజలను సురక్షిత 

ప్రాంతాలకు తరలించండి

అధికారులకు సీఎం ఆదేశం

 నీటిపారుదల శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కనీసం 15 ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్య లు తీసుకోవాలని సూచించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో బుధవారం మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


‘‘హైదరాబాద్‌లో గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున వరద వచ్చింది. నగరంలోని వరద నీటితో పాటు సమీప ప్రాంతాల చెరువుల నీరు కూడా హైదరాబాద్‌ చెరువుల్లోకి చేరింది. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’’ అని రజత్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. 


Updated Date - 2020-10-22T07:10:51+05:30 IST