ఆ నగరంలో 4,384 మందికి ‘కరోనా’ పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-11T17:21:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు మరిన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 6,955 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4,384 మందికి వైరస్‌ సోకింది. కలబుర్గి 276, మైసూరులో 266 మంది, బీదర్‌లో 215, తుమ

ఆ నగరంలో 4,384 మందికి ‘కరోనా’ పాజిటివ్‌


బెంగళూరు: కరోనా కేసులు మరిన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 6,955 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4,384 మందికి వైరస్‌ సోకింది. కలబుర్గి 276, మైసూరులో 266 మంది, బీదర్‌లో 215, తుమకూరులో 206 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా బెంగళూరు గ్రామీణలో 152 మంది, దక్షిణకన్నడలో 137 మంది బాధితులయ్యారు. గడిచిన రెండు రోజులతో పోలిస్తే కోలుకున్నవారు పెరిగారు. తాజాగా 3,350 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 36 మంది మృతిచెందగా బెంగళూరులో 19మంది, మైసూరులో ఐదుగురు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో 12మంది ఉన్నారు.

Updated Date - 2021-04-11T17:21:29+05:30 IST