పూలకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
ABN , First Publish Date - 2021-10-15T07:01:34+05:30 IST
చెన్నూ రు మండలంలోని శివలింగాపూర్ గ్రామా నికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగు బంటి దాడి చేసింది. బతుకమ్మ పూల కోసం గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్య, పంచికపు రమేష్లు గురువారం ఉదయం పాలవాగు సమీపంలోని అటవీ ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు.
చెన్నూరురూరల్, అక్టోబరు 14 : చెన్నూ రు మండలంలోని శివలింగాపూర్ గ్రామా నికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగు బంటి దాడి చేసింది. బతుకమ్మ పూల కోసం గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్య, పంచికపు రమేష్లు గురువారం ఉదయం పాలవాగు సమీపంలోని అటవీ ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అటవీ ప్రాం తంలో వాహనంపై వెళ్తుండగా ఎలుగుబం టి తన పిల్లలతో ఎదురుగా వచ్చింది. ఒక్క సారిగా తల్లి ఎలుగుబంటి ద్విచక్ర వాహ నంపై వెనక కూర్చున్న మల్లయ్యపై దాడి చేసింది. దీంతో వాహనం నడుపుతున్న రమేష్ కేకలు వేయడంతో మల్లయ్యను వదిలి పెట్టి వెళ్లిపోయింది. గ్రామానికి చేరు కుని 108 అంబులెన్స్లో చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడిలో కాలు, చెయ్యి విరిగినట్లు వైద్యులు తెలిపారు. గాయాలపాలైన మల్లయ్యను చెన్నూరు అటవీ అధికారులు పరామర్శించి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. మల్లయ్యకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని ఫారెస్టురేంజ్ అధికారి మధుసూధన్ తెలిపారు.