మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తానంటూ ప్రేయసి అందాన్నే అమ్మాయిలకు ఎరగా వేశాడు.. చివరకు ఆమె ప్రాణమే పోయిందిలా..!

ABN , First Publish Date - 2021-11-03T23:42:38+05:30 IST

ఓ వ్యక్తి.. అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపెడ్డాడు. పెళ్లి చేసుకుందామని, కష్టసుఖాల్లో కలిసి ఉంటానని కబుర్లు చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కన్ని రోజులపాటు వారిద్దరూ చట్టపట్టాలే

మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తానంటూ ప్రేయసి అందాన్నే అమ్మాయిలకు ఎరగా వేశాడు.. చివరకు ఆమె ప్రాణమే పోయిందిలా..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి.. అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపెడ్డాడు. పెళ్లి చేసుకుందామని, కష్టసుఖాల్లో కలిసి ఉంటానని కబుర్లు చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కన్ని రోజులపాటు వారిద్దరూ చట్టపట్టాలేసుకుని కలిసి తిరిగారు. ఈ క్రమంలోనే తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, మంచి జీతం వస్తుంది అంటూ ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం దారుణానికి పాల్పడ్డాడు. ప్రేయసి అందాన్ని ఎరాగా వేసి డబ్బులు దండుకున్నాడు. అనంతరం కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడంతో చివరికి ఆ యువతి ప్రాణమే పోయింది. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కిరణ్ అనే 27ఏళ్ల యువతి బీకాం చదివి, పీజీడీసీఏ కూడా పూర్తి చేసింది. అనంతరం ఆమె బ్యుటీషియన్‌గా మారాలనుకుంది. ఇందులో భాగంగానే బ్యుటీషియన్ కోర్సు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆ యువతికి దినేష్ దుబే అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అతడిని కిరణ్ నమ్మింది. ప్రేమకు పచ్చ జెండా ఊపింది. కొన్ని రోజులపాటు ఉత్సాహంగా తిరిగిన తర్వాత తనకు భోపాల్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పి, కిరణ్ తనతోపాటు అక్కడకు రావాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె అతడిని కాదనలేదు. ఆగస్ట్ 4న అతడితోపాటు భోపాల్ వెళ్లి, అక్కడే ఓ బ్యూటిపార్లర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే దినేష్ దారుణానికి పాల్పడ్డాడు. 



కిరణ్ ఫోటోను కొంతమంది యువతులకు చూపించి, తమను కూడా తన ప్రియురాలిలాగే బ్యూటిషియన్‌గా మారుస్తానని కబర్లు చెప్పాడు. తక్కువ డబ్బులకే బ్యుటీషియన్ కోర్సు ఇప్పిస్తానని నమ్మబలికి వారి దగ్గర డబ్బులు దండుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతులు కోర్సు కోసం కిరణ్ దగ్గరకు వెళ్లారు. దీంతో దినేష్ బండారం కిరణ్ తెలిసియింది. ఈ క్రమంలో ఆమె దినేష్‌తో మాట్లాడేందుకు తీవ్రంగా శ్రమించింది. దీంతో తన నెంబర్‌ను దినేష్ బ్లాక్ చేసినట్లు కిరణ్ గుర్తించింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు లోనైన ఆ యువతి.. అక్టోబర్ 5న ఆత్మహత్యకు చేసుకుని ప్రాణాలు వదిలింది. కిరణ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. వారి దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. దినేష్‌కు ఇంతకు ముందే పెళ్లైందని.. అతడికి పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా దినేష్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 




Updated Date - 2021-11-03T23:42:38+05:30 IST