ఆటో నర్సింగ్‌.. సర్పంచ్‌ అయ్యాడు!

ABN , First Publish Date - 2021-02-23T08:58:48+05:30 IST

అతను నిన్నటి వరకూ ఆటో నడిపేవాడు. అంతా అతడిని ఆటో నర్సింగ్‌ అని పిలిచేవారు. ఇప్పుడు సర్పంచ్‌గా గెలుపొందడంతో సర్పంచ్‌ నర్సింగ్‌ అయ్యాడు

ఆటో నర్సింగ్‌.. సర్పంచ్‌ అయ్యాడు!

పెందుర్తి : అతను నిన్నటి వరకూ ఆటో నడిపేవాడు. అంతా అతడిని ఆటో నర్సింగ్‌ అని పిలిచేవారు. ఇప్పుడు సర్పంచ్‌గా గెలుపొందడంతో సర్పంచ్‌ నర్సింగ్‌ అయ్యాడు.  విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జంగాలిపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో పోటీ చేసిన గొరపల్లి నరసింగరావు మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. అతడు 1995 నుంచి టీడీపీ కార్యకర్త. చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 2006 నుంచి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. 2006, 2013లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా నిరాశ చెందకుండా తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 94 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పంచాయతీలోని 8 వార్డులకుగాను ఆరు టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు.

Updated Date - 2021-02-23T08:58:48+05:30 IST