ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-07T05:20:25+05:30 IST

ఇంటర్మీడియెట్‌ పరీక్షలు శుక్రవా రం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంట ల వరకు పరీక్షలు కొనసా గాయి.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థినులు

మహబూబ్‌నగర్‌ (విద్యా విభాగం) మే 6 : ఇంటర్మీడియెట్‌ పరీక్షలు శుక్రవా రం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంట ల వరకు పరీక్షలు కొనసా గాయి.  ఉదయం తొమ్మిది గంటలు దాటి నిమిషం ఆల స్యమైనా అనుమతి లేదన్న నిబంధనతో  విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరు కున్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 11,104 మంది విద్యార్థులు  హాజరు కావాల్సి ఉండగా 10,583 మంది హాజ రయ్యారు. 521 మంది గైర్హాజర య్యారు. పరీక్షల కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. 

Read more