4 రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-08-04T22:01:53+05:30 IST

వరుసగా నాలుగు రోజుల పాటు ఎదురైన నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి...

4 రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ముంబై: వరుసగా నాలుగు రోజుల పాటు ఎదురైన నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో ఇవాళ ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. తుదికంటా అదే జోరు కొనసాగించి భారీ లాభాలు నమోదు చేశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 806 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకగా.. నిఫ్టీ మరోసారి కీలకమైన 11 వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 748 పాయింట్ల (2 శాతం) లాభంతో 37,687.91 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సైతం 204 పాయింట్లు బలపడి (1.87 శాతం) 11,095.25 వద్ద క్లోజ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్టీస్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి సుజుకి తదితర షేర్లు లాభాలు నమోదు చేయగా.. టెక్ మహింద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, టాటా మోటార్స్ తదితర షేర్లు వెనుకబడిన వాటిలో ఉన్నాయి. 

Updated Date - 2020-08-04T22:01:53+05:30 IST