చైనాలో అద్భుతం.. 459 అడుగుల ఎత్తులో.. వంగిపోయిన అద్దం వంతెన.. ఫొటోలు వైరల్!

ABN , First Publish Date - 2021-03-28T12:37:00+05:30 IST

చైనాలో మరో అద్భుతం సృష్టించారు. అత్యంత ఎత్తయిన గాజు వంతెన కట్టిన చైనా ఇంజనీర్లు ఈ సారి మరో ప్రయోగం చేశారు. కొంచెం కొత్తగా ఆలోచించి వంగిన వంతెనను సృష్టించారు.

చైనాలో అద్భుతం.. 459 అడుగుల ఎత్తులో.. వంగిపోయిన అద్దం వంతెన.. ఫొటోలు వైరల్!

బీజింగ్: చైనాలో మరో అద్భుతం సృష్టించారు. అత్యంత ఎత్తయిన గాజు వంతెన కట్టిన చైనా ఇంజనీర్లు ఈ సారి మరో ప్రయోగం చేశారు. కొంచెం కొత్తగా ఆలోచించి వంగిన వంతెనను సృష్టించారు. 140 మీటర్లు అంటే 459 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. 100 మీటర్ల పొడవైన ఈ గాజు వంతెన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.  చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో కట్టిన ఈ బ్రిడ్జిని ఇటీవలే చైనా ప్రభుత్వం ఓపెన్ చేసింది. 2017లోనే ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


అయితే ఇప్పటి వరకూ దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీన్ని స్థానికులు ‘బెండింగ్ బ్రిడ్జి’ అని పిలుచుకుంటున్నారు. దీన్ని చూడటానికి, దీనిపై షికారు చేయడానికి పర్యాటకులు ఎగబడుతున్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా మారిందనడంలో సందేహమేమీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలామంది నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీన్ని సందర్శించాలనే కోరిక వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-03-28T12:37:00+05:30 IST