ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు

ABN , First Publish Date - 2021-12-07T06:27:48+05:30 IST

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు
ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

 - కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 6: యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వానాకాలంలో నాణ్యమై న ధాన్యాన్ని చివరి వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం రైతులతో యాసంగిలో పంట సాగు ప్రణాళికపై చర్చించారు. యాసంగిలో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరించదని చెప్పినందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవ న్నారు. మిల్లర్లు, సీడ్‌ కంపెనీలతో ఒప్పందం కుదు ర్చుకున్న రైతులు మాత్రమే వరిపంట వేసుకోవాలని సూచించారు. వరికి బదులు మినుములు, కందులు, జొన్నలు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలు వేసుకోవాల న్నారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబం ధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. పంట మార్పిడికి తగిన సూచన లు, సలహాలు కూడా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తామన్నారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతం అవుతుందని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తోం దని, రైతులు గమనించి ప్రత్యామ్నాయ సాగుకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. రైతులు తమ సొంత భరోసాతో మాత్రమే వరిసాగు చేసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసా యాధికారి తిరుమల్‌ప్రసాద్‌, పెద్దపల్లి జడ్పీటీసీ రాంమ్మూర్తి, సర్పంచ్‌ త్రివేణి, మండల వ్యవసాయా ధికారిణి అలివేణి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:27:48+05:30 IST